Monday, May 12, 2025

అతిపెద్ద ఆన్​లైన్ ఫ్రాడ్ డాక్టర్​ను ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఏకంగా రూ.8.60 కోట్లు స్వాహా

ఒకరోజు రూ.23.56 లక్షలు, మర్నాడే రూ.3 లక్షలు, తర్వాత రోజు రూ.68 లక్షలు, ఆ మర్నాడే రూ.17.10 లక్షలు ఇలా 63 విడతల్లో ఏకంగా ఓ వైద్యుడి నుంచి రూ.8.60 కోట్లను సైబర్​ నేరగాళ్లు దోచుకున్నారు. ఈ దోపిడి అంతా షేర్ ​ట్రేడింగ్​లో జరిగింది. మోసపోయాయని గ్రహించిన డాక్టర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణ నేరాల చరిత్రలో ఇదే అతిపెద్ద ఆన్​లైన్ మోసంగా పోలీసులు చెబుతున్నారు.
తక్కువ కాలంలో అధిక రాబడులు పొందాలని అనుకున్నాడు ఆ వైద్యుడు. అందుకు షేర్​ ట్రేడింగ్​లో అధికంగా డబ్బులను పెట్టాడు. ముందుగా అధికంగా లాభాలు రావడంతో ఎక్కువ మొత్తం డబ్బులను అందులో పెట్టాడు. ఆ యాప్​ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైబర్​ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించాడు. ఏకంగా రూ.8,60,38,022 కోట్లను పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు తెలంగాణలో నమోదైన సైబర్​ నేరాల చరిత్రలో అతిపెద్ద ఆన్​లైన్​ మోసంగా పోలీసులు చెబుతున్నారు. ఈ మోసం హైదరాబాద్​లోని కేపీహెచ్​బీలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మే 21న వైద్యుడి ఫేస్​బుక్​ ఖాతాను బ్రౌజ్​ చేస్తుండగా స్టాక్​ బ్రోకింగ్​ కంపెనీల పేరిట ప్రకటన కనిపించింది. ఎలాగో తాను స్టాక్​లలో ఇన్వెస్ట్​ చేస్తాను కదా అని అందులో అడిగిన వివరాలను నింపి పంపారు. ఆ వెంటనే ఆ కంపెనీల ప్రతినిధులుగా వాట్సాప్​లో వైద్యుడిని కొందరు సంప్రదించారు. ఆయన ఫోన్​ నంబర్​ను నాలుగు గ్రూపుల్లో చేరారు. ఇన్వెస్టర్లకు లాభాలు తెప్పించడమే తమ సంస్థ విధి అని వారు డాక్టర్​తో చెప్పారు. అయితే ఆయా సంస్థలకు సంబంధించి ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈ లాంటి రెగ్యులేటరీ సంస్థల గుర్తింపు, ట్యాక్స్​ రిజిస్ట్రేషన్ల గురించి వైద్యుడు వారిని అడిగారు. అయితే అలాంటి రహస్యంగా ఉంచుతామని వెల్లడించడానికి వీల్లేదని అన్నారు. ఈ క్రమంలో 4 సంస్థల పేరిట యాప్​ లింక్​లను వైద్యుడికి వారు పంపించారు. వాటిల్లో సూచించిన బ్యాంకు ఖాతాలకు ఒకరోజు రూ.23.56 లక్షలు, మర్నాడే మరో రూ.3 లక్షలు, తర్వాతి రోజు రెండు విడతలుగా రూ.68 లక్షలు, ఆ మర్నాడు రూ.17.10 లక్షలు ఇలా ఏకంగా 63 విడతల్లో రూ.8,60,38,022 కోట్లను పంపించాడు.

తొలుత వారు లాభాలు ఉపసంహరించుకునేందుకు అవకాశమివ్వడంతో వైద్యుడి నమ్మకం ఏర్పడి ఇలా ఇంత మొత్తం చెల్లించాడు. ఈ రూ.8.6 కోట్లు చెల్లించిన అనంతరం లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా సైబర్​ నేరగాళ్ల అసలు రూపం బయటపడింది. లాభాల్లో 20నుంచి 30 శాతం చెల్లిస్తేనే ఉపసంహరించుకునే వీలుందని మెలిక పెట్టారు. అప్పుడు వైద్యుడు కస్టమర్​ కేర్​కు కాల్​ చేసి మాట్లాడిన ప్రయత్నించినా లాభం లేదు. దీంతో మోసపోయాయని గ్రహించి టీజీసీఎస్​బీకి ఫిర్యాదు చేశారు.

‘మ్యూల్‌’ ఖాతా అంటే ఏమిటి?

కమీషన్​కు ఆశపడి తమ బ్యాంకు ఖాతాలను సైబర్​ నేరగాళ్లకు అప్పగించే వారిని మనీ మ్యూల్స్​గా పిలుస్తారు. వైద్యుడి నుంచి కాజేసిన ఆ సొమ్మును ఇలా మనీ మ్యూల్స్​ ఖాతాలకే బదిలీ చేసుకున్నారు. 63 విడతల్లో నగదు బదిలీ జరిగిందంటే దేశవ్యాప్తంగా అలాంటి ఖాతాలు ఉన్నట్లు టీజీసీఎస్​బీ పోలీసులు గుర్తించారు. ఇలా ఒక ఖాతా కరీంనగర్​ జిల్లా వీణవంక బ్యాంకులో ఉండటం గమనార్హం. ఇలాంటి మనీ మ్యూల్స్​ ఖాతాలు విశాఖపట్టణం, కడప, దిల్లీ, ముంబయి, ఠాణే, చెన్నై, ఝాన్సీ, లఖ్​నవూ, ఇందౌర్​, లుథియానాలతో పాటు హరియాణాలోని కొన్ని ప్రాంతాలలో గుర్తించారు. వీటి గురించి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com