తమిళనాడు సీఎం, ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత, శనివారం జరుగుతున్న సమావేశానికి దక్షణాది ముఖ్యమంత్రులు, రాజకీయ పక్షాల నేతలతో పాటు.. ఫెయిర్ డీలిమిటేషన్ సమర్థిస్తున్న ఇతర రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించారు. డీఎంకే ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చెన్నై వేదికగా స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు శిరోమణి అకాలీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ భుందర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (కేరళ) ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలాం సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 7 రాష్ట్టాల నుంచి 14 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను స్టాలిన్ తనయడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్వయంగా ఆహ్వానించారు.
రాబోయే నియోజకవర్గాల పునర్విభజన సహేతుకంగా జరగాలంటూ దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేసే పునర్విభజన తమకు అంగీకారం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా కాలం నుంచి చెబుతున్నారు. న్యాయబద్దంగా డీలిమిటేషన్ కావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నైలో దక్షిణాది విపక్ష రాష్ట్రాల నేతల సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
తమిళనాడు సీఎం, ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత, శనివారం జరుగుతున్న సమావేశానికి దక్షణాది ముఖ్యమంత్రులు, రాజకీయ పక్షాల నేతలతో పాటు.. ఫెయిర్ డీలిమిటేషన్ సమర్థిస్తున్న ఇతర రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించారు. డీఎంకే ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చెన్నై వేదికగా స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు శిరోమణి అకాలీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ భుందర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (కేరళ) ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలాం సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 7 రాష్ట్టాల నుంచి 14 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను స్టాలిన్ తనయడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్వయంగా ఆహ్వానించారు.