బెయిల్ మంజూరు చేసిన కోర్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారిస్తున్న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ. మేరకేజ్ ట్రయల్ కోర్టు బెంచ్ జడ్జ్ నియాయ్ బిందు ఉత్తర్వులు జారీచేసింది.
లక్ష రూపాయల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన మొదటి వ్యక్తి అర్వింద్ కేజ్రీవాల్ కావడం గమనార్హం. కేజ్రీవాల్ కు పూర్తిస్థాయి బెయిల్ వచ్చింది కాబట్టి కవిత సహా మిగతవారికి సైతం బెయిల్ వస్తుందని భావిస్తున్నారు.