- గ్రేటర్ ఉన్నతాధికారులు సీరియఎస్
- సంబంధిత జోన్ ల్ కమిషనర్ పై బదిలీ వేటు
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం ముందు అక్రమ నిర్మాణాలను తొలగించిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ( ఐఏఎస్ అధికారి)పై వేటు పడింది. ఆయనను సాధారణ పరిపాలన విభాగం (జీఏడి)కి అటాట్ చేస్తూ జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
కూల్చివేతలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ మంత్రి ఆదేశాలతో జిహెచ్ఎంసి అధికారుల కూల్చివేతలు జరిగాయంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.