దేశమంతటికీ 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య ఫలాలు దక్కినా.నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఆ స్వేచ్చా వాయువులు పీల్చుకోవడానికి మరో 13 నెలలు వేచి చూడాల్సి వచ్చింది.మన దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య చేపట్టడంతో నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తమైంది. సెప్టెంబర్ 17న స్వేచ్ఛ పొంది స్వతంత్ర భారతంలో భాగమైంది. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరికీ శుభాకాంక్షలు.నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం తాలూకు స్ఫూర్తి ఇప్పటికీ ప్రజల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.