Saturday, April 19, 2025

‘డిజిఎల్’, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

సెన్సిబుల్ డైరెక్టర్ కె క్రాంతి మాధవ్ యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ వున్న మూవీస్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన న్యూ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్ చేశారు. క్రాంతి మాధవ్ తన లేటెస్ట్ మూవీ కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని సిద్ధం చేశారు, ఇది వాస్తవ సంఘటనల స్ఫూర్తి పొందిన కథ. ఈ చిత్రానికి డిజిఎల్‌ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో హీరో తన టీ-షర్ట్‌ని వెనుక నుంచి లిఫ్ట్ చేసి డిఫరెంట్ ఫోజ్ లో కనిపించారు. కాజీపేట జంక్షన్‌లోని రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉండగా, అతని చుట్టూ వివిధ ట్రాక్‌లపై రైళ్లు వెళుతున్నాయి. పోస్టర్‌లో జర్నీ బిగిన్స్ అని రాసుంది.

టీమ్ విడుదల చేసిన మరో పోస్టర్‌లో స్నేహితుల గ్యాంగ్ రైల్వే బ్రిడ్జి పైన ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రజెంట్ చేస్తోంది. రెండు పోస్టర్‌లు క్యురియాసిటీని పెంచాయి. డిజిఎల్‌ సినిమా షూటింగ్ నవంబర్ 2024లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.జ్ఞాన శేఖర్ వీఎస్ కెమెరా మ్యాన్. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ క్లాసిక్ తర్వాత క్రాంతి మాధవ్, జ్ఞాన శేఖర్ వి.ఎస్‌. కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com