అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు కూడా
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు ఇస్తామని రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామనీ, శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఇండ్లు, పెన్షన్లన్నీ రేఫన్ కార్డులు ఉంటేనే ఇస్తామని అందుకే రేషన్ కార్డుల జారీని ప్రాధాన్యతాంశంగా తీసుకున్నామన్నారు.