Thursday, September 19, 2024

వరద ప్రభావిత ప్రాంతలలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం 

రాణిగారితోట 17,18వ డివిజన్ లలో లొ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్ మరియు వైసీపీ నాయకులు
దేవినేని అవినాష్ పాయింట్స్ :
నగరంలోని వరద బాధితులను ఆదుకోవటం ప్రతీ ఒక్కరి భాధ్యత.పెద్ద మనసుతో ఒక కోటీ పది లక్షల సహాయం మాజీ ముఖ్యమంత్రి జగన్  ప్రకటించారు.యాభై వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులను
ఇంటి, ఇంటికీ పంపిణీ చేస్తున్నాం.తూర్పు నియోజకవర్గంలో 15,16,17,18 డివిజన్ లలో వరద ప్రభావానికి గురైన నాలుగు డివిజన్ లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం.ఈ వరదలకు టిడిపి పార్టీ, చంద్రబాబు వైఫల్యం కారణం కాదా అని ప్రశ్నిస్తున్నాం.ఇకనైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలి.ఇప్పటికే వరద నష్ట  ప్రభావం ప్రజలపై వుంది.గెలుపు ఓటములుతో సంబంధం లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్నాం.
100 రోజుల కూటమి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు తప్ప చేసిందేమీ లేదు.కృష్ణలంకకు రిటైనింగ్ వాల్ లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేది.వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ కుటుంబం లక్ష రూపాయలు పైగా నష్టపోయారు.స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకునే పనిలో ఉన్నాడు.రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్ కు ఎప్పటికీ రుణ పడి వుంటామని ప్రజలు చెబుతున్నారు.కుటుంబంకు అవసరమయ్యే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు కిట్ రూపంలో  పంపిణీ నేడు చేస్తున్నాము.మంత్రులే అధికారులను తిడుతున్నారు అంటే టిడిపి  పాలన ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular