Monday, March 10, 2025

చేతిలెత్తి మొక్కుతాం..! మాకు న్యాయం చేయండి

  • చేతిలెత్తి మొక్కుతాం..!
  • మాకు న్యాయం చేయండి
  • ఎంఎల్ సీలుగా మాకు అవకాశం కల్పించండి
  • గవర్నర్ కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ నేతలు

హైకోర్టు తీర్పు ఆదేశానుసారంగా గవర్నర్ కోటాలో తిరిగి తమనే నామినేట్ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణలు సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చామని…. అందువల్ల చేతులెత్తి మిమ్మల్సి మొక్కుతున్నామన్నారు. కిందిస్థాయి నుంచి తమకు ఎంఎల్ సీలుగా అవకాశం కల్పించాలని గవర్నర్ తమిళసైను వారు కోరారు.

అనంతరం రాజ్ భవన్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ కోట ఎంఎస్ సీలుగా గత జూలై 31వ తేదీన అప్పటి క్యాబినెట్ సమావేశంలో కేసీఆర్ తమకు అవకాశం కల్పిస్తూ తీర్మానం చేశారన్నారు. దీనిపై 55 రోజుల తర్వాత గవర్నర్ తమ అభ్యర్థనను తిరస్కరించారన్నారు. దీంతో రాజ్యాంగ ఉల్లాఘన జరిగింది అని కోర్టును ఆశ్రయించామన్నారు. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం….రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో గవర్నర్ కోటలో అమీర్ అలీ ఖాన్, కోదండ రాం ల పేర్ల తో గజిట్ బయటి వచ్చిందన్నారు. దీనిపై తాము వేసిన పిటీషన్ పై హైకోర్టు స్పందించి రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. దీంతో కొందండ రాం, అమీర్ అలీ ఖాన్ ల నియామకాని బ్రేక్ పడిందన్నారు. అయితే వారికి తాము వ్యతిరేకంగా కాదన్నారు. కేవలంపేద కులం కు చెందిన వాళ్ళాం మాకు న్యాయం చేయండనే గవర్నర్ ను కోరుతున్నామన్నారు. పైగా తాము ముందు వరుసలో ఉన్నామని, కాబట్టి మాకు ఎంఎల్ సీలుగా అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com