మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల జిల్లాలో పర్యటిస్తుండగా ఆయనకి చేదు అనుభవం ఎదురయ్యింది. మంత్రి పొంగులేటి.. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి ఆలింగనం చేసుకోబోయాడు. దీనికి జీవన్ రెడ్డి సహించక.. ఆలింగనం వద్దంటూ వెనక్కి వెళ్ళిపొయ్యారు. మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని పొంగులేటి వినతిపత్రం అందజేశారు జీవన్రెడ్డి. ప్రభుత్వ ఇసుక పాయింట్ లేకపోవడం వల్ల అక్రమ రవాణా ఎక్కువైందని మంత్రికి తెలియజేశారు. పొంగులేటి మాట్లాడుతూ తప్పని సరిగా ఇసుక పాయింట్ ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్రెడ్డిని ఆలింగనం చేసుకోబోయ్యారు. వెంటనే జీవన్ రెడ్డి వెనక్కి జరిగి నమస్కారం అంటూ మంత్రితో మాట్లాడారు. ఇందుకు సంభందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.