దోస్త్ నోటిఫికేషన్ విడుదల
మే 6 నుంచి ఫస్ట్ ఫేజ్, జూన్ 4 నుంచి సెకెండ్ ఫేజ్, జూన్ 19 నుంచి థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు
టీఎస్, న్యూస్ :రాష్ట్రంలో అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు విడుతల్లో ప్రవేశాల కోసం మే 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యిన విద్యార్ధులు డిగ్రీ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశం కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న వెయ్యికి పైగా డిగ్రీ కాలేజీల్లో ఈ సారి నాలుగున్న లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్
మే 6 తేదీ నుండి ను మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ జరగనుంది. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వెబ్ ఆప్షన్ లు మే 15 నుంచి మే 27 వరకు ఇవ్వల్సివుంది. జూన్ 3వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ లోపు సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
రెండవ ఫేజ్ రిజిస్ట్రేషన్
ఫేస్ -2 రిజిస్ట్రేషన్స్ 400 రూపాయలతో జూన్ 4 నుంచి జూన్ 13 వరకు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు జూన్ 4 నుండి జూన్ 14 వరకు ఇచ్చుకోవల్సివుంది. జూన్ 18వ తేదీన రెండవ దశ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జూన్ 19 నుంచి జూన్ 24 వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
మూడవ ఫేజ్ రిజిస్ట్రేషన్
మూడవ ఫేజ్ రిజిస్ట్రేషన్ 400 రూపాయలతో జూన్ 19 నుంచి జూన్ 25 వరకు చేసుకోవాలి. జూన్ 19 నుంచి జూన్ 25 వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. జూన్ 29 మూడోదశ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జులై 8నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం బీకాం ఫైనాన్స్ ,కోర్సు బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కొత్త కోర్సులు డిగ్రీలో అందుబాటులో ఉన్నాయి.