- సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి
- మహానుభావుల ప్రగతిఫలాలను అందుకొని ప్రజలంతా ముందుకుసాగాలి
- డాక్టర్ టి.రఘురామ్ ప్రిన్సిపల్ సిబిఐ, జడ్జి
దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయని డాక్టర్ టి.రఘురామ్ ప్రిన్సిపల్ సిబిఐ, జడ్జి పేర్కొన్నారు. నాంపల్లి సిబిఐ కోర్టులో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండాను ఎగురవేశారు.
అనంతరం డాక్టర్ టి.రఘురామ్ ప్రిన్సిపల్ సిబిఐ జడ్జి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరంగంలో మార్పు కనిపిస్తుందని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆ మహానుభావుల త్యాగాల పునాదులపై మనదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా దూసుకుపోవాలని ఆయన ఆకాక్షించారు.
ఆ మహానుభావుల ప్రగతిఫలాలను అందుకొని ప్రజలంతా ముందుకుసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైతేయినీ, జడ్జి, ఈఓ కోర్టు, మహ్మద్ అప్రోజ్ అక్తర్, జడ్జి, ఏసిబి కోర్టు, జ్యుడీషియల్ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు బి.లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.