Monday, March 10, 2025

ఓటేయరాని విద్యావంతులు

మండలి ఎన్నికల పోలింగ్‌లో విద్యావంతుల నిర్లక్ష్యం బయటపడింది. డిగ్రీలు, పీజీలు చేసి ఎంత చదివినా.. ఓటేసుడు కూడా వస్తలేదు. డిగ్రీలు, పీజీలు చేసినా.. టీచర్లుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించినా.. ప్రాథమిక హక్కులో భాగమైన ఓటేయటం మాత్రం తెలవట్లేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. భారీగా చెల్లని ఓట్లు బయటపడ్డాయి. వేల సంఖ్యలో చెల్లని ఓట్లు దాఖలయ్యాయి. చాలా మంది ఓటేయటం రాకపోవటంతో వాటిని ఇన్ వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించారు. ఓటింగ్‌ గురించి ఇటు ఎన్నికల సంఘం, అటు అభ్యర్థులు నమూనాలు పట్టుకుని పదేపదే చెప్పినా.. విద్యావంతులు మాత్రం అతి తెలివి చూపించారు. ఫలితంగా ఫలితాలను డిసైడ్ చేసే స్థాయిలో చెల్లని ఓట్లు పడ్డాయి.

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. వరంగల్-ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందారు. ప్రస్తుతం ఇదే గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభర్థి అంజిరెడ్డి 5 వేల పైచిలుకు లీడ్‌లో ఉండగా.. ఫలితం తేలకపోటవంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

ఇంత మందికి ఓటేయడం రాలే
ఈ మూడు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు మాత్రమే ఓటర్లుగా ఉండి ఓటేశారు. అయితే వారిలో చాలా మందికి ఓటేయం రాలేదు. ప్రస్తుతం కౌటింగ్ జరగుతుండగా.. భారీగా చెల్లని ఓట్లు బయటపడుతున్నాయి. డిగ్రీలు, పీజీలు చేసినా.. టీచర్లుగా కొనసాగుతున్నా వారికి ఓటేయటం మాత్రం రాలేదు. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో సుమారు 28 వేల ఓట్లు, టీచర్ స్థానంలో 871 ఓట్లు చెల్లకుండాపోయాయి.

వరంగల్- ఖమ్మం-నల్గొండ టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీలోనూ 499 ఓట్లు చెల్లకుండా పోయాయి. తాము ఓటేయదల్చుకున్న అభ్యర్థుల ఎదురుగా ఉన్న బాక్స్‌లో 1,2, 3, 4, 5 లాంటి అంకెలకు బదులు టిక్ మార్కులు పెట్టడం, సర్కిల్స్ గీయడం, అభ్యర్థుల పేర్లు రాయడం, సిగ్నేచర్ చేయడం, ఓకే అని రాయటం, రకరకాల కామెంట్స్ రాయటం వంటి చర్యలతో ఓట్లు చెల్లకుండా పోయాయి. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో మెుత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య 11 శాతానికి పైగానే ఉంది.

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలనే దానిపై ముందస్తుగా ప్రచారం చేసినా.. చాలా మందికి ఓటేయటం రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఓటేసింది నిరక్ష్యరాసులో, వృద్ధులో కాదు. చదువుకున్న యువకులు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేసే టీచర్లు. అలాంటిది వీరికి ఓటేయటం రాకపోవటంపై కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారికంటే.. వారెవరో నయం అన్నట్లుగా వీరి తీరు ఉందని విమర్శలు చేస్తున్నారు. కొందరైతే మన విద్యా వ్యవస్థను తప్పుబడుతున్నారు. మన డిగ్రీలు, పీజీలు కాగితాలకే పరిమితమనే విషయం ఈ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పల్లెటూళ్లలో ఎలాంటి చదువు లేకున్నా.. వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఓటేస్తారని.. బాగా చదువుకున్న విద్యావంతులకు ఓటేయం రాకపోవటం నిజంగా సిగ్గుచేటని అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com