Tuesday, April 15, 2025

ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్ కు ఎస్కార్ట్ బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు మరోసారి ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. తన తల్లి దశ దినకర్మ కార్యక్రమాల కోసం నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఆయన, ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్పై బయటకు రానున్నారు. రాధాకిషన్‌ రావు తల్లి సరోజినీ దేవి ఈ నెల 3న మృతి చెందారు.

అనారోగ్య కారణాలతో 2వ తేదీ రాత్రి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ మరునాడు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టును అభ్యర్థించగా, అందుకు కోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com