ఆదేశ మంత్రితో ఉత్తమ్ చర్చలు
తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన బియ్యం పిలిప్పైన్స్ దేశానికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు మెరుగు పడుతున్నాయి. పిలిప్పైన్స్ కు బియ్యం ఎగుమతులపై ఆ దేశ వ్యవసాయ మంత్రితో రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.శనివారం పౌర సరఫరాల భవన్ నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిలిప్పియన్లకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలపై మొదట చర్చించారు. సివిల్ సప్లైస్ కమీషనర్తోపాటు ఆయా రంగాలలోని కొంత మంది నిపుణులతో చర్చించిన తర్వాత, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి , ఫిలిప్పియన్స్దేశానికి చెందిన ఆహార , వ్యవసాయ శాఖ మంత్రి రోజేర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వకంగా , సానుకూల వాతావరణంలో సాగాయి. నాణ్యత కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్ని ఏళ్లుగా భారతదేశం నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ఆపివేశారని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
ప్రభుత్వానికి ఎగుమతి చేసే అవకాశం ఉందని , అది కార్యరూపం దాల్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర బియ్యం ఫిలిప్పియన్లకు ఎగుమతి అవుతుందని తెలిపారు. మంత్రులిద్దరూ ఒకరికొకరు పూర్తి సహకారంతో హామీలు ఇచ్చుకున్నారు. ఒప్పందం త్వరలో కార్యరూపం దాల్చాలని ఆకాంక్షించారు. ఇది సాకారమైతే, తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఇది మరో మంచి అవకాశం అవుతుందని, మెరుగైన నాణ్యత కారణంగా, మన బియ్యం కొన్ని సంవత్సరాల విరామం తర్వాత ఒక దేశానికి ఎగుమతి అయ్యే అవకాశం ఏర్పడనుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.