ఒకేసారి తండ్రీ కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగం?
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో తండ్రి, కొడుకు అర్హత సాధించడం ఆసక్తికరంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన దాసరి రవికిరణ్ (53) ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు మైకేల్ ఇమ్మానియేలు (25) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వార డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవికిరణ్ తనయుడు ఇమ్మానియేలు కు సూచనలు ఇవ్వడంతో పాటు తాను సైతం గ్రూప్-1 పరీక్ష రాశారు.
కొడుకుతో పాటు తాను కూడా ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. ఈ విషయం తెలిసి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంతా ఆశ్చర్యానిగి గురవుతున్నారు. రిజర్వేషన్ తో పాటు ఇన్ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో గ్రూప్-1 పరీక్ష రాయగలిగినట్టు ఇమ్మానియేలు చెప్పారు. మెయిన్స్ కూడా పాసై తండ్రీ కొడుకులిద్దరికి గ్రూప్ వన్ ఉద్యోగం వస్తే అది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అవుతుందని అంటున్నారు అధికారులు.