Wednesday, September 18, 2024

మటన్ ముక్కలు తక్కువేశారని… పెళ్లిలో లొల్లి

పెళ్లికి వచ్చిన వరడు ఫ్రెండ్స్ కు భోజనంలో మటన్ ముక్కలు తక్కువేశారంటూ వడ్డించే వ్యక్తులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇందులో వధువు బంధువులు కలగజేసురకోవడంతో గొడవ మరింత తీవ్రమైంది. దీంతో అక్కడున్న గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకుంది. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి అయింది.

అయితే పెళ్లికి వచ్చిన వరడు ఫ్రెండ్స్ కు భోజనం వడ్డించి అందులో మటన్ ముక్కలు తక్కువ వేసి సూప్ పోశారంటూ వారు వడ్డించే వ్యక్తులతో గొడవకు దిగారు. చివరకు ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లుగా ఎస్సై వినయ్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular