-
ఫ్లడ్ అప్ డేట్స్ – 1
-
5-9-2024
మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో శరవేగంగా సాగుతున్న వరద సహాయ చర్యలు.వరద బాధితులను ఆదుకునేందుకు పెద్దఎత్తున స్పందిస్తున్న దాతలు.మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులను అందజేసిన ప్రముఖులు.ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 10 లక్షలు, మల్లెల రాజేష్ నాయుడు 10 లక్షలు అందజేత.అమలాపురం ఎంపీ గంటి హరీష్, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి వాసు, పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న రూ. 5లక్షల చొప్పున అందజేత.విజయవాడకు చెందిన బుద్దిరాజు శివాజీ రూ. 5లక్షల అందజేత.దాతలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్.బుడమేరు గండ్ల పూడ్చవేత పనులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డ్రోన్ లైవ్ ద్వారా పర్యవేక్షిస్తున్న లోకేష్.తుది దశకు చేరిన 2వ గండి పూడ్చివేత పనులు.క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి రామానాయుడుతో సమన్వయం చేస్తూ వేగంగా గండ్లు పూడ్చివేత పనులు.