తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. గత రోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి.
ఈ నేపథ్యంలో సంయుక్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి.
ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము అని ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రి సహాయనిధికి హీరోలు ఎన్టీఆర్ రూ. కోటి, విశ్వక్ సేన్ రూ. 10లక్షలు ప్రకటించారు.