హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మందికి పైగా మానసిక రోగులు అస్వస్థతకు గురవ్వగా, వారికి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి సిబ్బంది ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.