Thursday, April 17, 2025

Former DSP Nalini: నన్ను పిఆర్ స్టంట్ కోసం వాడుకున్నారు…!

  • దాదాపు ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించడం లేదు…
  • నేను ఇచ్చిన రెండు దరఖాస్తులు బల్ల మీద ఉన్నాయా లేక చెత్త బుట్టలోకి పోయాయ…
  • సోషల్‌మీడియాలో లేఖను పోస్ట్ చేసిన మాజీ డిఎస్పీ నళిని

మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ‘తనను పిఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ ఉద్యోగిని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె ఆచూకీ తెలుసుకొని సిఎంను కలవాలంటూ మాజీ డీఎస్పీ నళినికి కబురు పంపారు. అప్పట్లో నేరుగా ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. నళినికి పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా సిఎం రేవంత్ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా నళిని తిరస్కరించారు.

ప్రస్తుతం ఆమె అధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, ఉద్యోగం చేసుందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిట్‌నెస్ తాను లేనని చెబుతూ ప్రభుత్వం సాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సాయం చేయాలని ఆమె అడిగారు. దీనికి సంబంధించి రెండు వినతిపత్రాలను సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. సిఎం రేవంత్ రెడ్డిని నళిని కలిసి దాదాపు ఏడు నెలలు అవుతున్నా ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సారి కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

నళిని రాసిన లేఖ ఇదే..
ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పిఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఈ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాచకులకు ఇచ్చిన విలువ కూడా తనకు రేవంత్ ప్రభుత్వంలో ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి సిఎం కొలువుకు ఎక్కగానే తనకు ఎక్కువ ప్రచారం కల్పించారని ఇప్పుడు చప్పుడే చేస్తలేరని నళిని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగిన సందర్భంలోనూ నా ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతకీ తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా లేక చెత్త బుట్టలోకి పోయాయ అన్న అనుమానం కలుగుతుందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. సిఆర్‌ఓ, ఓఎస్డీకి ఓ లేఖ రాశానంటూ ఆమె ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

తీవ్ర ఆవేదన..
చిన్నప్పుడు అడుక్కుంటూ ఎవరైనా ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెల్లవయ్య అని మెల్లగా చెప్పేవాళ్లమని, కనీసం అలాంటి మర్యాద అయినా తనకు ఇస్తారేమో చూడాలని ఆమె పేర్కొన్నారు. తాను చాలా ఏళ్లుగా ఎవ్వరినీ కలవలేదని ఉద్యమం చేసేటప్పుడే తనకు చాలా విషయాలు అర్థం అయ్యాయని ఆమె చెప్పారు. ఒక నెలలో తన పిటీషన్ విచారణ పూర్తి చేస్తారని భావించానని ఏడు నెలలు పూర్తైనా ఎటువంటి స్పందన లేకపోవడంతో రిమైండ్ లెటర్ రాయాల్సి వచ్చిందని నళిని తెలిపారు. సచివాలయం చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక తన వద్ద లేవన్న విషయాన్ని రేవంత్ రెడ్డిని కలినప్పుడే చెప్పానని నళిని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com