Thursday, May 15, 2025

మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఇంట విషాదం

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య డాక్టర్ శ్వేత మరణించారు. కొద్దీరోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించడంతో గంటల వ్యవధిలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. లక్ష్మారెడ్డి,శ్వేత దంపతులకు స్పూర్తి రెడ్డి, స్వరణ్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో మంగళవారం సాయంత్రం శ్వేతారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్వేతారెడ్డి మృతిపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక జడ్చర్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డి … కేసీఆర్ మొదటి కేబినేట్ లో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com