Monday, June 2, 2025

నేటి నుంచే..! రేషన్‌ షాపుల్లో ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యంను మూడునెలలకు ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచి ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రేషన్‌ షాపులు పని చేయనున్నాయి. ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసే సన్న బియ్యం ఈసారి మూడు నెలలకు కలిపి ఒకే నెలలో ఇవ్వనున్నారు. ఈ మేరకు సివిల్‌ సప్లయిస్‌ విభాగం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఏ నెలకానెల బియ్యం పంపిణీ జరిగేది. అయితే ఈ సారి మాత్రం ఒకే నెలలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జూన్‌ నెలలోని అన్ని రోజుల్లో రేషన్‌ షాపులు తెరిచి ఉంచుతారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రేషన్‌ షాపులు పని చేయనున్నాయి. అన్ని గ్రామాలకు సంబంధించిన రేషన్‌ బియ్యం షాపులకు వచ్చిందని, బియ్యం అందుబాటులో ఉంచి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com