బీఆర్ఎస్ పార్టీ దారుణంగా వికెట్లను కోల్పోతోంది..! ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది..! ఇది చాలదన్నట్టు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్లో చేరేందుకు లైన్ క్లియర్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపేశారు. చూడబోతే పరిస్థితి ఎమ్మెల్యేతో ఆగేలా లేదు. వరుస చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అంచుకు చేరుకోవడంతో నేతలంతా వలస బాట పడుతున్నారు.