Monday, May 26, 2025

అవతల కొంత.. ఇవతల కొంత

రెండు భాగాలుగా విడిపోనున్న జీహెచ్ఎంసీ?

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జీహెచ్‌ఎంసీని రెండుగా విభజించే ఆలోచనలో ఉంని సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు నగరాన్ని విస్తరించి, చుట్టుపక్కల మున్సిపాలిటీలను విలీనం చేయాలని యోచిస్తోంది. విస్తీర్ణం పెరగడంతో పాలన కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై అధ్యయనం చేయడానికి ఒక బృందం ఢిల్లీ, ముంబై నగరాలకు వెళ్లనుంది.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం, హైదరాబాద్ అభివృద్ది కొరకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతుంది. అలానే పాలన సౌలభ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ తాజాగా తఓ సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని రెండుగా విభజించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండు వైపులా…!
రేవంత్ సర్కార్ హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. ఇదే జరిగితే.. ప్రస్తుతం 625 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధి.. 2 వేల చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది. అప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద నగరంగా నిలుస్తుంది. హైదరాబాద్ విస్తీర్ణం ఈ స్థాయిలో పెరిగిగే.. పాలన కష్టం అవ్వడమే కాక.. అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా ముందుకు సాగవు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోన్నట్లు సమాచారం. కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి పెరిగితే.. అప్పుడు పాలన సౌలభ్యం కోసం దాన్ని రెండుగా విభజించాలని భావిస్తోందట.

జీహెచ్ఎంసీ విభజన విషయంపై అధ్యాయనం చేసేందుకు.. ఒక బృందం..ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించేందుకు రెడీ అవుతోంది. ఆయ నగరాల విస్తీర్ణం, వాటి కార్పొరేషన్లు పనిచేసే తీరుపై ఈ బృందం ఆధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఇక ఇప్పటికే ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం దాదాపు ఖరారు అయిన సంగతి తెలిసిందే. వీటి విలీనం తర్వాత.. మొత్తాన్ని ఒక కార్పొరేషన్ గా ఉంచడమా లేక రెండుగా విభజించడమా అనేదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది.. ఓఆర్ఆర్ వెంబడి ఉన్న 51 గ్రామాలను దాని లోపలి మున్సిపాలిటీల్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రేటర్ విస్తరణ తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com