భారతీయ మహిళలకు బంగారం అంటే ఎనలేని మక్కువ. మనవాళ్లకు నగలు ధరించడం అంటే ఎంతో ప్రీతి. అయితే ఆ ధరలు మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో నిలుస్తున్నాయి. అయితే ఒక్కోసారి బంగారం ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుంది. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పెరిగాయి. గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. శనివారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర 97,320 ఉండగా, 22 క్యారెట్ల ధర 89,210 లుగా ఉంది. బంగారం పది గ్రాములపై రూ.10 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.100 తగ్గి రూ.99,800 లుగా ఉంది.
కాగా శుక్రవారంతో పోలిస్తే హైదరాబాద్ లో బంగారం ధర తగ్గింది. నిన్న రూ.98000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.97,320 కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ధర నిన్న 89,600 ఉండగా నేడు రూ.89,210లుగా ఉంది. ఇక వెండి శుక్రవారం 99,744 ఉండగా నేడు కిలో వెండి ధర రూ.1,10,800లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,800 లుగా ఉంది.