కొనుగోలుదారులకు పసిడి ధర షాక్ ఇచ్చింది. పార్లమెంట్లో బడ్జెట్లో బంగారంపై సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పసిడి ధర భారీగా తగ్గుతూ వచ్చింది. దాదాపు రూ.6వేల వరకు పతనమైంది. తాజాగా సోమవారం బులియన్ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.150 పెరిగి తులానికి రూ.63,400కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగి తులానికి రూ.69,160కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. వివిధ నగరాల్లో బంగారం స్వల్పంగా పెరగ్గా.. చెన్నైలో పసిడి 22 క్యారెట్లపై రూ.500 తగ్గి.. తులానికి రూ.64,150కి తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.550 పడిపోవడంతో రూ.69,980కి చేరుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,310కి తగ్గింది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.63,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,160కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.63,400 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,160కి దిగివచ్చింది. ఇక వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.500 పెరిగి ఢిల్లీలో కిలో వెండి ధర రూ.85వేలు పలుకుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.89,500కి చేరింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది.ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.