Wednesday, May 28, 2025

కడుపులో బంగారం స్మగ్లింగ్‌ సినీ స్టైల్​లో ఆరుగురు గోల్డ్ స్మగ్లర్ల కిడ్నాప్

ఆ ఆరుగురూ గోల్డ్ స్మగ్లర్లు. వారిలో నలుగురు బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి, వాటిని మింగేశారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో విమానం ఎక్కి న్యూదిల్లీలో దిగారు. దర్జాగా ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చారు. వీరంతా ఉత్తర్​ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఉన్న టాండా బాద్లీ గ్రామస్తులు. ఎయిర్‌పోర్టు దగ్గర ఒక ట్యాక్సీ మాట్లాడుకొని తమ సొంతూరికి బయలుదేరారు. అయితే, మురాదాబాద్ – లఖ్‌నవూ హైవేపై ఉన్న పాత టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే, వీరి ట్యాక్సీకి అడ్డుగా రెండు కార్లు వచ్చి నిలబడ్డాయి. ఆ కార్లలో ఉన్న ఆరుగురు దుండగులు తుపాకులతో బెదిరించి ఆరుగురు గోల్డ్ స్మగ్లర్లను కిడ్నాప్ చేశారు. వారిని సమీపంలోని రోడా రోడ్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ స్మగ్లర్ల పొట్టలను చీల్చి బంగారం క్యాప్సూల్స్‌ను బయటికి తీసేందుకు దుండగులు యత్నించారు. ఈక్రమంలో ఒక స్మగ్లర్ దుండగుల చెర నుంచి తప్పించుకొని.. బిగ్గరగా అరుస్తూ దూరంగా పరుగెత్తాడు. తమను కాపాడాలంటూ కేకలు పెట్టాడు. దీంతో అక్కడున్న ప్రజలంతా ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.వారిలో ఎవరో ఒకరు పోలీసులకు కాల్ చేసి, జరుగుతున్న విషయాన్ని చెప్పారు.

దుండగులపై పోలీసుల కాల్పులు
పోలీసు టీమ్ హుటాహుటిన ఆ ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంది. పోలీసులను చూసి ఆరుగురు దుండగులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఇద్దరు దుండగులు దొరికిపోయారు. వారిని చికిత్స నిమిత్తం మురాదాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు గోల్డ్ స్మగ్లర్లను కూడా ఆ ఆస్పత్రికే తీసుకెళ్లి వైద్యులతో అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించారు. దీంతో వారిలో నలుగురి ఆహార తిత్తుల్లో క్యాప్సూల్స్ ఉన్నట్లు తేలింది. తదుపరిగా వైద్యులు సర్జరీ చేసి వారి ఆహార తిత్తుల్లో ఉన్న 9 క్యాప్సూల్స్‌ను వెలికి తీశారు. వాటిలో 300 గ్రాముల దాకా బంగారం లభ్యమైంది. ఒక్కో క్యాప్సూల్‌లో 25 గ్రాముల దాకా బంగారాన్ని దాచి తెచ్చారని తేలింది.

నలుగురి పొట్టల్లో గోల్డ్ క్యాప్సూల్స్ దొరికాయి
“నలుగురు స్మగ్లర్లు ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. వారికి ఏనిమా ఇచ్చి, పొట్టలో ఇంకా ఏమైనా క్యాప్సూల్స్ మిగిలి ఉంటే తీసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. సౌదీ నుంచి వచ్చిన షానే ఆలం, ముతల్వీ, అజారుద్దీన్, జుల్ఫీకార్‌ల పొట్టల్లో బంగారంతో కూడిన క్యాప్సూల్స్ దొరికాయి. నవీద్, జాహిద్‌ల పొట్టల్లో బంగారం దొరకలేదు. వాళ్లంతా సౌదీలో ఉద్యోగం కోసం వెళ్లారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో ఒక ముఠా వారిని టార్గెట్ చేసింది. స్మగ్లర్లతో పాటు దుండగులపై కేసులు నమోదు చేశాం. దీనిపై కస్టమ్ విభాగానికి సమాచారాన్ని చేరవేశాం” అని మురాదాబాద్ సిటీ ఎస్‌పీ రణ్ విజయ్ సింగ్ వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com