మాస పూజకు రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా, టికెట్లను ఆన్ లైన్ లో కేటాయించ నున్నామని, క్యూ ద్వారా దర్శనం చేసుకునే అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించ నున్నామని అధికారులు తెలిపారు.
ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం రూ. 10 వసూలు చేయనున్నామని వెల్లడించారు.