* నిమిషం కాదు.. ఇక ఐదు నిమిషాలు
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల విద్యార్థులకు టెన్షన్ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి ప్రకటించిన గ్రేస్ టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతినిస్తారు. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధన ఎత్తివేత. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5 నిమిషాల సమయాన్ని అదనంగా ఇస్తారు. ఉదయం 9.30 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు తెలంగాణలో జరగనున్నాయి.