- 500 మంది అనాధలను దత్తత తీసుకున్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్
మిస్ వరల్డ్ సీఈవో జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ సీఈవో జూలియా తెలంగాణపై పెద్ద మనసు చూపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 మంది పిల్లలను జూలియా మోర్లే దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టింది. దాతలు. అనాధ పిల్లలకు 50 ఐటమ్స్ తో ఉన్న ఒక కిట్ ను డొనేట్ చేశారు. అందాల పోటీల్లో మిస్ వరల్డ్ స్థానం ప్రత్యేకమైనది. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ రెండు వేర్వేరుగా పోటీలు జరుగుతూ ఉంటాయి. వీటి ఆర్గనైజర్స్ కూడా వేరే. అయితే మిస్ యూనివర్స్ కేవలం అందంగా ఉండటానికి ప్రాధాన్యతను ఇస్తే మిస్ వరల్డ్ మాత్రం అందంతో పాటు మన ఆలోచనలు కూడా అందంగా ఉండాలనేది కాన్సెప్ట్ గా నడుస్తోంది. మిస్ వరల్డ్ సీఈవో జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు.
ప్రపంచ సుందరిని ఎంపిక చేసేటప్పుడు అందమైన రూపంతో పాటు వారు చేసే సామాజిక కార్యక్రమాలు సమాజం పై వారికి ఉన్న బాధ్యత సమాజం కోసం వాళ్ళు చేస్తున్న పనుల ఆధారంగా విజేతలను సెలెక్ట్ చేస్తారు. అంతేకాదు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా చారిటీ వర్క్స్ భారీగానే చేస్తుంది. అయితే మిస్ వరల్డ్ సీఈవో జూలియా తెలంగాణపై పెద్ద మనసు చూపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 మంది పిల్లలను జూలియా మోర్లే దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టింది. తాను చేస్తున్న మంచి పనిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని దాతలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం జరిగింది. ఫార్చ్యూన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రామకృష్ణ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో కోలెబరేషన్ అయ్యారు. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 500 మంది అనాధ పిల్లలను ఏడాది పాటు దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని ఖర్చులను డాక్టర్ రామకృష్ణ భరించనున్నారు. అయితే మిస్ వరల్డ్ సీఈవో జూలియా ఫార్చ్యూన్ హాస్పిటల్ ని సంప్రదించి తాము చేస్తున్న చారిటీ కార్యక్రమంలో భాగంగా కావాల్సిందిగా కోరిన వెంటనే గొప్ప కార్యక్రమానికి అంగీకారం తెలిపారు దాతలు. అనాధ పిల్లలకు 50 ఐటమ్స్ తో ఉన్న ఒక కిట్ ను డొనేట్ చేశారు. ఇందులో ఓ పెద్ద సూట్కేస్ తో పాటు బెడ్ షీట్, బట్టలు, పుస్తకాలు, టాయిలెట్ కిట్, సోప్స్, ఫేస్ క్రీమ్స్, మాశ్చరైజింగ్ క్రీమ్స్, బేసిక్ మెడిసిన్స్ పెన్నులు పెన్సిళ్ళు ఉన్నాయి.