25 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవల ఎస్.ఎల్.బి.సి సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఆచూకి దొరకని ఎనిమిది మందిలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ మృత దేహం ఈ రోజు లభ్యమైంది.
పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. అమెరికా కు చెందిన రాబిన్ సన్ కంపెనీ లో ఉద్యోగిగా ఆయన టిబిఎమ్ ఆపరేటర్ గా చేస్తున్నారు.
సొరంగం లో జరిగిన ప్రమాదంలో గురుప్రీత్ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
గురుప్రీత్ సింగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సనుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. మృత దేహాన్ని పంజాబ్ లోని వారి స్వగ్రామానికి పంపించారు.