బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, కలుస్తదని కొందరు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్సీ కవితకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై కేసీఆర్ ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 100 స్థానాల్లో పైగా విజయం సాధించి అధికారంలోకి వస్తామన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉందని భరోసానిచ్చారు. అక్రమ కేసులు పెట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వారి పేర్లు రెడ్ బుక్ లో రాసి పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించే అధికారులపై తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకే.. పోలీస్ కమాండ్ కంట్రోల్లో సమీక్షలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్రావు.
చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీనేనని హరీష్రావు విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ను రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్నారని.. వీటి పనులను నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్ను ఆపాలని సవాల్ విసిరారు. బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్కు అనుమతి ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఇప్పటివరకు ఏం చేసిందని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపమని ఆరోపించారు. బనకచర్లను ఆపడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బనకచర్లను అపుతామని హరీష్రావు పేర్కొన్నారు.
బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్కు అనుమతి ఇచ్చి అన్యాయం చేస్తుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీ తెలంగాణాకు ఏం చేసిందని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపమని ఆరోపించారు. బనకచర్లను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బనకచర్లను అపుతామని అన్నారు.