కాళేశ్వరంపై వేసిన విచారణ కమిషన్ మంగళవారం కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. వారిద్దరి మధ్య అరగంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం హరీష్ రావు తెలంగాణలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ కు విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.