హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా, ఉత్తమ క్రీడాకారులను తీర్చిద్దిదే క్రమంలో భాగంగా ముచ్చర్ల లో స్పోర్ట్ హబ్, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని అసెంబ్లీలో సిఎం రేవంత్రెడ్డి ప్రకటించడం హర్షణీయమని హెచ్సిఏ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు అన్నారు.
ఇటీవల హెచ్సిఏ చేసిన విజ్ఞప్తిని గౌరవించి 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తున్నామని, జిల్లాల్లో క్రికెట్ మైదానాలను నిర్మిస్తామని తెలిపినందుకు రాష్ట్రంలోని క్రికెట్ అభిమానుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగన్ మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.