ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్..
˜కాంప్లిమెంటరీ పాస్ల కోసం
బెదిరిస్తే కఠిన చర్యలు
˜విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం
హైదరాబాద్ క్రికెట్ సంఘం, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్లు కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి. ఈ కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశముందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇకపోతే ఈ విషయంపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం అధికారులు వివరాలు సేకరించారు.
ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో బెదిరించిందో లేదో అనే అంశంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించారు. ఈ అంశాన్ని విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరికలు చేసారు. ఐపీఎల్ టికెట్లు, పాస్ల కోసం హెచ్సీఏ వేధిస్తోందని ఎస్ఆర్హెచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత టికెట్ల కోసం హెచ్సీఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలో తీవ్ర ఆందోళన చెందినట్లు హెచ్సీఏ కోశాధికారికి సన్రైజర్స్ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు 10శాతం కాంప్లిమెంటరీ టికెట్లు- కేటాయిస్తున్నామని, 50 సీట్ల సామర్థం ఉన్న ఎఫ్ 12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు- కూడా అందులో భాగమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. కానీ, ఈ ఏడాది దాని సామర్థం 30 మాత్రమే అని పేర్కొంటూ… అదనంగా మరో 20 టికెట్లు- కేటాయించాలని అడిగారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్-3 బాక్సుకు తాళాలు వేశారని తెలిపారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లడంతో హెచ్సీఏ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏపై వొస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి హెచ్సీఏకు ఒప్పందం ప్రకారం 10శాతం ఉచిత టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టిక్కెట్ల సామర్థం ఉన్న కార్పొరేట్ బాక్స్ను హెచ్సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది, ఆ బాక్స్ సామర్థం 30కి తగ్గిందని చెప్పి, అదనంగా మరో 20 టిక్కెట్లు ఇవ్వాలని హెచ్సీఏ డిమాండ్ చేసింది. దీనిపై చర్చిద్దామని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు సూచించగా.. ఒక మ్యాచ్ సందర్భంగా హెచ్సీఏ అధికారులు వారి కార్పొరేట్ బాక్స్కు తాళం వేశారు. చివరకు 20 టిక్కెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్సీఏ ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వొచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో గత రెండు సంవత్సరాలుగా హెచ్సీఏ పాసులు ఇచ్చినా సరే.. అదనంగా మరికొన్నిపాసులు ఇవ్వాలని వేధిస్తోందని ఆరోపించారు. ఉప్పల్ స్టేడియంలో ఆడడం ఇష్టం లేకుండా హెచ్సీఏ ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోందని..
ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో చర్చించి మరొక హోమ్ గ్రౌండ్ కోసం ఆలోచించాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై హెచ్సీఏ వెంటనే స్పందించింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అధికారిక ఇమెయిల్ ద్వారా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్సీఏ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని హెచ్సీఏ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
సోషల్ మీడియా, పలు వెబ్సైట్లలో ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం లేదని అధికారులు అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఈమొయిల్స్ వొచ్చుంటే.. ఆ సమాచారం హెచ్సీఏ లేదా ఎస్ఆర్హెచ్ అధికారిక ఈమొయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమొయిల్స్ నుంచి లీక్ చేయడం వెనుకున్న కుట్ర ఏంటి?. హెచ్సీఏ-ఎస్ఆర్హెచ్ ప్రతిష్టను తీసేందుకు కొందరు పనిగట్టు-కొని చేస్తున్న దుష్పచ్రారమని అన్నారు. ఈ -మొయిల్స్ నకిలీవా, నిజమైనవా? తెలుసుకోవడానికి ఎస్ఆర్హెచ్ నుంచి కూడా మీడియా స్పష్టమైన వివరణ తీసుకోవాలని హెచ్సీఏ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.