Wednesday, April 9, 2025

Gold seizure at China border: చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం అందడంతో అనుమానాస్పదంగా సంచ రిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నిం చారు. సోదాలు చేయగా 108 కిలోల బంగారు కడ్డీలతో పాటు రెండు మొబైల్‌ ‌ఫోన్లు, బైనాక్యులర్‌, ‌రెండు కత్తులు, చైనాకు చెందిన కొన్ని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీబీపీ వెల్లడించింది.

ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇందులో ఇద్దరు లద్దాఖ్‌లోని న్యోమా ప్రాంతానికి చెందినవారిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఆ ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com