Wednesday, October 16, 2024

Group-1 Mains గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని గ్రూప్ – 1 అభ్యర్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల పై ధర్మసనం విచారణ చేపట్టింది. ఆ రెండు పిటిషన్లను కొట్టేసింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో తమ ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

హాల్ టికెట్స్ విడుదల….

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు Group1 Hall Ticket Download లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

ఈ నెల 21 నుంచి …

వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular