Saturday, April 19, 2025

హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జిలు

అమరావతిః హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. సోమవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో మహేశ్వరరావు కుంచెం (అలియాస్ కుంచం),తూటా చంద్ర ధన శేఖర్ (అలియాస్ టిసిడి శేఖర్),చల్లా గుణరంజన్ లచే అదనపు న్యాయమూర్తులుగా చీఫ్ ధీరజ్‌ జస్టిస్ సింగ్‌ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈఅదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని పలువురు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ తదితరులు పాల్గొన్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com