పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 72.34 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్ఫంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 39.17 శాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ , మల్గాజిగిరిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సికింద్రాబాద్ లో 42.48 శాతం, మల్కాజిగిరిలో 46.27 పోలింగ్ నమోదైంది. కాగా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ ఉండగా.. ఆ తర్వాత జహీరాబాద్ సెగ్మెంట్లో 71.91 శాతం, మెదక్లో 71.33శాతం, ఖమ్మంలో 70.76 శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈసారి కూడా ఎక్కువగా ఓట్లేశారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఆసక్తి చూపించడం లేదు. ఇక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో 47.88 శాతం పోలింగ్ జరిగింది.
ఓటెద్దాం రండి
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్లో తక్కువ ఓటింగ్ నమోదైంది. ప్రధానంగా పాతబస్తీ ఏరియాలో ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపించలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. తక్కువ స్థానంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమే నిలిచింది. హైదరాబాద్సెగ్మెంట్లో కేవలం 29.47 శాతం పోలింగ్ జరిగింది. దీంతో కొంతమంది యువత ఓటర్లను పిలిచేందుకు వీధుల్లో తిరిగారు. ఒక్కో ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఓటేయాలని అభ్యర్థించారు.
==
ఉదయం 9 గంటలకు 9.51 శాతం
ఉదయం 11 గంటలకు 24.31 శాతం
మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం
మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం
సాయంత్రం 5 గంటలకు 61.16 శాతం
==
నియోజకవర్గాల వారీగా..
==
అదిలాబాద్ -69.81
భువనగిరి -72.34
చేవెళ్ల -53.15
హైద్రాబాద్ -39.17
కరీంనగర్ -67.67
ఖమ్మం -70.76
మహబూబాబాద్ -68.60
మహబూబ్నగర్ -68.40
మల్కాజిగిరి -46.27
మెదక్ – 71.33
నాగర్ కర్నూల్ -66.53
నల్గొండ -70.36
నిజామాబాద్ -67.96
పెద్దపల్లి -63.86
సికింద్రాబాద్ -42.48
వరంగల్ -64.08
జహీరాబాద్ -71.91
==
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (అసెంబ్లీ) 47.88 ( ఉపఎన్నిక)