Sunday, March 9, 2025

హెచ్‌ఎండీఏ పరిధి పెంపు డీపీఆర్‌ రెడీ.. 16 మండలాలు విలీనం

హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధి పెంచేందుకు డీపీఆర్‌ రెడీ అయింది. ఈ పరిధి పెంపు అంశంపై ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 16 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో చేరుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు విలీనం కసరత్తు ప్రారంభించారు. మరోవైపు, హెచ్ఎండీఏలో చేరే మండలాల్లో భూమలు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో లక్షల్లో ఉన్న విలువ ఇప్పుడు కోట్లకు చేరుకుంది. తాజాగా హెచ్ఎండీఏ పరిధి పెంపునకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయడంతో.. 2050 బృహత్తర ప్రణాళికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. నేడో రేపో జారీ ఆర్ఎఫ్‌పీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏ రెడీ అవుతోంది.
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా దాదాపు 30 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్‌కు సుమారు 40 కి.మీ దూరంతో రీజినల్ రింగు రోడ్డును నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ఫోర్త్ సిటీని డెవలప్ చేయనున్నారు. ఇక నగర అభివృద్ధిలో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిని పెంచనున్నారు. ఈ మేరకు తాజాగా హెచ్ఎండీఏ పరిధి పెంపునకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా.. 2050 బృహత్తర ప్రణాళికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. నేడో రేపో జారీ ఆర్ఎఫ్‌పీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏ రెడీ అవుతోంది.
ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా.. కొత్తగా మరో 3 వేల చ.కి.మీ వరకు చేర్చనున్నారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో పాటుగా.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 41కు పెరగనున్నాయి. కొత్తగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాద్, నల్గొండ జిల్లాలోని దాదాపు 16 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఈ మొత్తం ఏరియాకు కొత్తగా 2050 అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఔటర్ రింగు రోడ్డు వరకు వరకు కోర్‌ అర్బన్, ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్‌.. ఆ తర్వాత గ్రామీణ తెలంగాణగా విభజించన్నారు. ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులు మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి తీసుకురానున్నారు.
ఈ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్‌ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చకుండా పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యారు. ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు వరకు ప్రజారవాణాకు పెద్దపీట వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేడియల్‌ రహదారులు, గ్రిడ్‌ రహదారులకు ముందే మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణతో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. గతంలో ఆయా ప్రాంతాల్లో ఎకరం లక్షల్లో ఉండగా.. ప్రస్తుతం రూ. కోటి దాటుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com