Sunday, October 6, 2024

సీతక్కకు హోం..!

  • రాజగోపాల్​రెడ్డి, దానంకు మంత్రి పదవులు
  • త్వరలో కేబినేట్ విస్తరణ అంటున్న దామోదర రాజనర్సింహ

తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్‌ చోటు దక్కే అవకాశం ఉందన్నారు.

అలాగే కేబినేట్‌లో రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి కేబినెట్‌లో ఒకరికి స్థానం ఉందని చెప్పారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఆరు కేబినేట్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవుల కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చేరికలు పూర్తయ్యాకే కేబినెట్ విస్తరణ చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మీడియాతో చిట్​చాట్​ నిర్వహించిన దామోదర రాజనర్సింహా.. ఇంట్రెస్టింగ్​కామెంట్స్​ చేశారు.

రాజగోపాల్​రెడ్డి, దానం నాగేందర్​తో పాటుగా నిజామాబాద్​ నుంచి ఒకరికి క్యాబినెట్​లో చోటు ఉంటుందన్నారు. అయితే, ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ పార్టీ బీఫారం మీద గెలిచిన వారికే మంత్రి పదవి అంటూ చెప్పారు. కానీ, దానం నాగేందర్​కు కూడా మంత్రి పదవి వస్తుందని మంత్రి దామోదర చెప్పడం చర్చగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular