Tuesday, March 11, 2025

తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా దిల్లీకి వెళ్తా..

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా రావటానికి తానే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌పై విమర్శలతో దాడి చేశారు. కేసీఆర్‌ను ఓడించి.. సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అన్నారు రేవంత్‌. ఎం‌పీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వొచ్చిందంటే కారణం తానేనని కేటీఆర్‌ ‌గుర్తించాలని చెప్పారు. స్టేటస్‌ ‌గురించి కేటీఆర్‌ ‌మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్‌ ఎవరు? ఎక్కడి నుంచి వొచ్చారు? అని ప్రశ్నించారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్‌ ‌మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది అసెంబ్లీకి వొచ్చే స్థాయి కాదన్నారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. కేసులకు భయపడితే క్రైమ్‌ ‌చేయరు. అందుకే కేటీఆర్‌ ‌భయపడను అంటున్నారంటూ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ ‌గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు.
కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? అని సీఎం రేవంత్‌ ‌ప్రశ్నించారు. తెలంగాణకు కిషన్‌రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తానని చెప్పారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్‌రెడ్డి రాలేదని రేవంత్‌ ‌విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వొద్దంటామా..?  అని సీఎం రేవంత్‌ ‌ప్రశ్నించారు. రింగ్‌ ‌రోడ్డు అంటే రింగ్‌ ఉం‌డాలి కదా.. మరి సగం ఇచ్చి రింగ్‌ అని ఎలా అంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్షం పెడితే బీజేపీ వాళ్లు రాలేదు. కేసీఆర్‌ ఏమైనా అంటారనే కిషన్‌ ‌రెడ్డి ఆ సమావేశానికి రాలేదేమో అని సీఎం రేవంత్‌ అన్నారు. అన్ని రాష్ట్రాలను బీజేపీ సమానంగా చూడటం లేదని సీఎం రేవంత్‌ ఆరోపించారు. బుల్లెట్‌ ‌ట్క్రెన్‌ ‌గుజరాత్‌ ఇచ్చారు.. తెలంగాణ ఎందుకివ్వడం లేదని రేవంత్‌ ‌ప్రశ్నించారు.
తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత .. తిరిగి కేంద్రం కేటాయించిన నిధులు ఎంత..? చర్చకు వొస్తానంటే సీఎంగా తాను, భట్టి చర్చకు రావడానికి సిద్ధమని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా దిల్లీ వెళ్తానని చెప్పారు. తాను దిల్లీకి వెళ్లడం వల్లనే హైదరాబాద్‌లో అభివృద్ధి కావాల్సిన క్లియరెన్స్ ‌వొచ్చిందని రేవంత్‌ ‌చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా తప్పించుకున్నది బీఆర్‌ఎస్‌ ‌కాదా..? అని రేవంత్‌ ‌ప్రశ్నించారు. హరీష్‌ ‌రావు లాంటి వాళ్లు దొంగ దెబ్బ తీశారని సీఎం చిట్‌చాట్‌లో కామెంట్‌ ‌చేశారు. మంద కృష్ణ మాటలు బీజేపీ మాటలుగా కొట్టిపడేశారు. ఏపీలో అసలు వర్గీకరణే మొదలు కాలేదని తిప్పికొట్టారు. గతంలోనే పూర్తి చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదు.. చావులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని రేవంత్‌ ‌విమర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com