Sunday, March 16, 2025

10 Naxals Killed In Encounter: చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్… పదిమంది మావోయిస్టు మృతి

  • పదిమంది మావోయిస్టు మృతి
  • ధ్రువీకరించిన బస్తర్ ఐజి. పి. సుందర్‌రాజ్

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొంటాం, భెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఎన్‌కౌంటర్‌లో పలువురు నక్సలైట్లు హతమయ్యారు.

మావోయిస్టులను చుట్టుముట్టేందుకు డిఆర్‌జి బృందం బయలుదేరింది. ఒరిస్సా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. పిఆర్పీ ఎఫ్ యొక్క కొంటా రేంజ్ సైనికులు మరియు డిఆర్ జి సైనికులు వెతుకులాటలో ఉన్నారు. బిఆర్ జి బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు విజయం సాధించారు. ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజి పి సుందర్‌రాజ్ ధృవీకరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com