ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాస్తామని చెప్పారు.
అదేవిధంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి ప్రారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అయితే ఆ మొత్తం ఎంతనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు.