Sunday, September 29, 2024

ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ 

  • న్యూయార్క్ ను పోల్చకునేలా నగరాన్ని తీర్చిదిద్దుతాం
  • కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ సీఈవో తో సీఎం రేవంత్ భేటీ
దేశంలోని ఇతర నగరాలతో తాము పోటీ పడటం లేదని, హైదరాబాద్​ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది  కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రం నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడి వెళ్లి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందన్నారు. అందుకే  న్యూయార్క్​తో  పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్   సంస్థ ఆసియా పసిఫిక్  సీఈవో  మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్నతీరుపై ఈ భేటీలో చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ దేశంలోనే శరవేగంగా వృద్ధి చెందుతోందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా  తమ అధ్యయన వివరాలను పంచుకుంది.
గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీస్ స్పేస్,  నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్ లోనూ హైదరాబాద్ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని తెలిపింది.  తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో  హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular