Saturday, April 19, 2025

గోల్కొండ కోటలోనే స్వాతంత్ర వేడుకలు

ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులతో కలిసి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మన సాంస్కృతిక వారసత్వం ప్రతిభింబించేలా సాంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాలు కోలాటం, భైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తారన్నారు.

పిల్లలలో దేశభక్తి స్ఫూర్తిని రగిల్చేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com