యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోస్ట్
భారీతీయులు గర్వించే విషయమన్న ప్రధాని మోదీ
న్యూదిల్లీ: భారతీయ సంస్క•తి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. శ్రీకృష్ణుడి బోధించిన భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్క•తిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు.
ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించు కున్నాయని కేంద్రమంత్రి తన పోస్ట్లో వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం.. మన జ్ఞాన సంపద, సంస్క•తికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు.