అక్రమంగా ఇసుకను రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రీచ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని సూచించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.