కోలీవుడ్ హీరో ఆర్య నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. అధికారులు బుధవారం సోదాలు జరుపుతున్నారు. ఆర్య నివాసంతో పాటు తమిళనాడులోని అన్నానగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు చెందిన సీ షెల్ రెస్టారంట్లపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆర్యపై పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా.. ఈ దాడులపై స్థానిక మీడియాతో నటుడు ఆర్య స్పందించాడు. సీ షెల్ రెస్టారంట్లతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపాడు. కొన్నేళ్ల క్రితమే ఈ రెస్టారెంట్ల నిర్వహణ బాధ్యతను మరో వ్యక్తికి అప్పగించినట్టుగా ఆర్య తెలిపాడు.